సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ…
దేశంలోనే మొట్ట మొదటిసారిగా కరుడుగట్టిన సైబర్ నేరగాడి ఆగడాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కళ్లెం వేశారు. ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయలేని ఓ యువకుడు ఎవరికీ దొరకకుండా తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పేమెంట్ గేట్ వేల నుంచి మాయం చేస్తున్నాడు. ఎథికల్ హ్యాకర్లకు కూడా అంతుచిక్కని స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాడు. అతడు ఉపయోగించే సిమ్ కార్డు నుండి బ్యాంకు ఖాతాల వరకు అన్నీ నకిలీ పత్రాల ద్వారా తెరిచినవే. అసలు ఇంజనీరింగ్ డ్రాప్…
సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ నేరగాడు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఎంపీ సంజీవ్ కుమార్ కు ఫోన్ వచ్చింది.…
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. కొందరు అమాయకులు గూగుల్లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసి దారుణంగా మోసపోతున్నారు. తెలంగాణలో ఓ విద్యార్థి కూడా ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ వద్ద కమీషన్ పేరుతో 99,232 రూపాయలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 5వ తేదీన పార్ట్ టైం జాబ్ కోసం సుంకరి…
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు సరిగా లేకపోవడం వల్ల అప్పులు తీసుకుంటున్నారు. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారని, పోలీస్ దాడులతో..కొద్దిరోజులు లోన్స్ ఇవ్వటం ఆపేశారన్నారు. అధిక లాభాలు…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేట మోతీనగర్కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు.…
Fake messages in the name of Collector Suryakumari కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ గురించి తెలియని వారి నుంచి ఇంతో అంతో తెలిసిన సామాన్యుడి వరకు ఏదో ఒక రూపంలో సైబర్ దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతో మంది వారి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల రాజకీయ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి.. వారే డబ్బు…
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు భద్రత లేకుండా పోయింది. ఆకతాయిలు హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పోలిష్ చేయడం లాంటివి చేస్తూ పైశాచికానందం పొందుతుంటారు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి హ్యాకర్ల చేతిలకు చిక్కి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలా ఇబ్బందులు ఎదుర్కున్న హీరోయిన్లో కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉంది. గతంలో ఆమె ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన హ్యాకర్స్ ఆమె మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసి హల్చల్ చేశారు. ఈ…
ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహేష్ బ్యాంకు పై సైబర్ దాడి చేసి రూ. 12 కోట్లకు పైగా డబ్బులను కేటుగాళ్లు కాజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా.. మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మల్లింపుకు సంహరించిన ఖాతాదారులపై పోలిసుల దృష్టి సారించారు. దీంతో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ బెంగుళూరు పూణే ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీస్ బృందాలు…