DCP Narasimha : సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని, ఎక్కువ ఫిర్యాదులు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాళ్లంతట వల్లే సీఈఐఆర్లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్లో ఫిర్యాదు చేయాలని,…
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఊరట.. ఓ కేసులో నిర్దోషిగా ప్రకటన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇమ్నాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ ఖైజర్, సైఫుల్లా నియాజీ, సదాకత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మీరు…
పొరపాటున మీ అకౌంట్కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.
పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
Hyderabad CP DP: సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట నయా దందాకు తెరలేపారు. ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నారు. ఈ దందా కోసం ఏకంగా పోలీసు శాఖ అధికారులనే వాడేసుకుంటున్నారు.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది. సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా భీమవరంకు చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరించి రూ. 73 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.
Telangana MLA: టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు అందరూ సైబర్ నేరాల బారిన పడుతున్నారు.