Minister Sridhar Babu: మనకంటే మన గురించి గూగుల్కే ఎక్కువ తెలుసు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
- సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి.
- మనకంటే మన గురించి గూగుల్కే ఎక్కువ తెలుసునని మంత్రి కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu: హైదరాబాద్ లో నేడు (ఫిబ్రవరి 18) న జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోని టెక్నాలజీ రంగం సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో కీలకంగా ఎదిగిపోతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ గురించి ప్రపంచం ఆసక్తిగా చూస్తున్నదని, ఇది టెక్నాలజీ రంగంలో ఎదుగుదలకై స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. 350 కోట్లు ఫ్రీజ్ చేసి 183 కోట్లు భాదితులకు రిఫండ్ ఇవ్వడం ఒక రికార్డు అని ఆయన అన్నారు.
Read Also: Manchu Manoj : పోలీసులతో గొడవ.. వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
డిజిటల్ యుగంలో కొత్త అడుగులు, అలాగే సైబర్ నేరాలకు సంబంధించిన రిస్క్ లు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. మనకంటే మన గురించి గూగుల్ కే ఎక్కువ తెలుసని.. కాబట్టి డిజిటల్ ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీపై పెద్ద జాగ్రత్త అవసరమని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇంకా పవర్ గ్రిడ్ వంటి క్షేత్రాల్లో కూడా ప్రవేశించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సైబర్ నేరస్తులు మన డబ్బులు మాత్రమే కాదు, మన డేటాను కూడా దొంగలిస్తునారని హెచ్చరించారు.
Read Also: KTR: సీఎం ప్రజల్ని మోసం చేసి గెలిచాడు.. రైతు నిరసన దీక్షలో కేటీఆర్
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సైబర్ నేరాలు దాదాపు 10 ట్రిలియన్ రూపాయలను వసూలు చేస్తున్నాయని, మన దేశంలో సైబర్ నేరాల ద్వారా 15 వేల కోట్లు కాజేస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం కొత్త సెక్యూరిటీ పాలసీని ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, సైబర్ డిఫెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇకపై సైబర్ సెక్యూరిటీ పరంగా తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా, సైబర్ చాలెంజ్లను అధిగమించేందుకు “షీల్డ్ కాంక్లెవ్” అనేది ఎంతో ఉపయోగకరమవుతుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..