Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ
- పండుగల పేరుతో ప్రజల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు.
- సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్.
- ఇంకా నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్లు చక్కర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్ల రూపంలో లింక్స్ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక ప్రజలు సైబర్ వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఏ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా సంబంధిత సంస్థల అధికారిక వెబ్సైట్ ద్వారానే తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Recharge Plans: మొబైల్ యూజర్లకు పండగే.. అదిరిపోయే బెనిఫిట్స్ తో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Also Read
- CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ఇకపోతే సైబర్ నేరగాళ్లు కొత్తగా వారి రూటు మార్చారు. సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్ను పంపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. పండుగల సందర్బంగా ఉచిత రీఛార్జ్లు, బంపర్ ఆఫర్లు అంటూ వస్తున్న మెసేజ్లు ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా, నకిలీ .Apk లింక్స్ పంపించడం.. ఆ లింక్స్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా సంక్రాంతి లేదా మహా కుంభమేళా పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: మోడీలానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు
ప్రస్తుతం నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఉపయోగించి, ఉచిత రీఛార్జ్ ఆఫర్ అందిస్తున్నారని చెబుతూ లింక్ పంపుతున్నారు. ఈ లింక్పై క్లిక్ చేస్తే నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేయడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. నూతన సంవత్సర ఆఫర్లు, పండుగల ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్లను నమ్మవద్దని, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి, మహా కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు మోసపోవకుండా ఉండేందుకు ఈ సూచనలను పాటించడం మంచింది.
తాజావార్తలు
-
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
-
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?