Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ
- పండుగల పేరుతో ప్రజల ఫోన్లకు మెసేజ్ లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు.
- సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్.
- ఇంకా నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్లు చక్కర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్ల రూపంలో లింక్స్ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక ప్రజలు సైబర్ వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఏ ఆఫర్ గురించి తెలుసుకోవాలన్నా సంబంధిత సంస్థల అధికారిక వెబ్సైట్ ద్వారానే తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Recharge Plans: మొబైల్ యూజర్లకు పండగే.. అదిరిపోయే బెనిఫిట్స్ తో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
ఇకపోతే సైబర్ నేరగాళ్లు కొత్తగా వారి రూటు మార్చారు. సంక్రాంతి, మహా కుంభమేళాను టార్గెట్ చేసి ఆ పేరుతో లింక్స్ను పంపి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. పండుగల సందర్బంగా ఉచిత రీఛార్జ్లు, బంపర్ ఆఫర్లు అంటూ వస్తున్న మెసేజ్లు ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా, నకిలీ .Apk లింక్స్ పంపించడం.. ఆ లింక్స్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా సంక్రాంతి లేదా మహా కుంభమేళా పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: మోడీలానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు
ప్రస్తుతం నూతన సంవత్సర రీఛార్జ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఉపయోగించి, ఉచిత రీఛార్జ్ ఆఫర్ అందిస్తున్నారని చెబుతూ లింక్ పంపుతున్నారు. ఈ లింక్పై క్లిక్ చేస్తే నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేయడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. నూతన సంవత్సర ఆఫర్లు, పండుగల ఆఫర్ల పేరుతో వచ్చే మెసేజ్లను నమ్మవద్దని, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా cybercrime.gov.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి, మహా కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు మోసపోవకుండా ఉండేందుకు ఈ సూచనలను పాటించడం మంచింది.
తాజావార్తలు
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?