Home
Crisis
Crisis News
-
Srilanka: సంక్షోభ శ్రీలంకకు ఇండియా సాయం.. 4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక, మానవతా సాయం
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇండియా ఆర్థికంగా.. హార్థికంగానూ సాయం చేయడానికి ముందుకొచ్చింది. శ్రీలంక తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయం చేయడానికి భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది -
LIVE: లంకా దహనం.. శ్రీలంకలో హింస
https://youtu.be/OhCCLSb_rV8 అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా… -
Sri Lanka Crisis: ప్రధాని పదవికి రాజీనామా చేసిన మహిందా రాజపక్సే
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని… -
దేశంలో మండిపోతున్న ధరలు…సంక్షోభం తట్టుకోగలమా.? దేశం ముందున్న సవాళ్లేంటి.?
వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది. సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పెంచిన పాలసీ రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. వృద్ధికి… -
Srilanka Crisis: శ్రీలంకలో సోషల్ మీడియాపై ఆంక్షలు
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం… -
అక్కడ లీటర్ పాలు వెయ్యి రూపాయలు… భయపెడుతున్న గ్యాస్ సిలిండర్…
శ్రీలంకలో ఆహారం కొరత, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యవసర ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధర రెండు రోజుల్లో 90శాతం మేర పెరిగి రూ.2657కి చేరింది. పాలు, సిమెంట్ సహా అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంగా ఆ దేశంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా విదేశీ మారక… -
దేశంలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం… నగదు కోసం భారీ క్యూలు..
మయమ్మార్ దేశంలో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొన్నది. ఆరు నెలల క్రితం సైన్యం ఆధికారాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సమస్య ప్రారంభం అయింది. ప్రజలు సైన్యంపై తిరుగుబాటు చేయడంతో సైనిక ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ పై నిషేదం విధించింది. ఇంటర్నెట్ను డౌన్ చేసింది. డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో డబ్బు కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల వద్ద తెల్లవారుజాము 3 గంటల నుంచే క్యూలు కడుతున్నారు. ఏటీఎం లలో నిత్యం నగదును నింపుతున్నప్పటికీ సరిపోవడంలేదు. పైగా… -
ఒపెక్ కూటమిలో కుదరని ఏకాభిప్రాయం…చమురు సంక్షోభం తప్పదా?
ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్కతాటిపై నిలబడి బలమైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి. చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇవి ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్రపంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!