Karnataka: కర్ణాటకలోని బాగల్కోట్లో చిన్న వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
Crime: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని 6వ తరగతి విద్యార్థి కత్తితో పొడిచి చంపాడనే ఆరోపణలతో పోలీసులు అతడ్ని మంగళవారం నాడు అరెస్టు చేశారు.
Crime: 10 ఏళ్ల బాలుడిని అతడి తల్లి ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. డెడ్ బాడీని సూట్ కేస్లో పెట్టి పొదల్లో విసిరినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. గౌహతి పోలీస్ డిప్యూటీ కమిషనర్ (తూర్పు) మృణాల్ డేకా మాట్లాడుతూ.. తన కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి శనివారం మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిందని చెప్పారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఓ మహిళ ఘనత వెలికితీశారు. ఈ ఘటన మార్చి 3న గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 216 జాతీయ రహదారిపక్కన జరిగింది.
Crime : హైదరాబాద్ అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉంటున్న వృద్ధ దంపతులపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత బంగారం, డబ్బు దోచుకుని పారిపోయారు. బాలనగర్ డిసిపి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై తమకు ఉదయం 8 గంటలకు ఫోన్ వచ్చిందని.. ఘటనా స్థలికి వెళ్లి చూస్తే వృద్ధ దంపతులు నెత్తురోడుతూ చనిపోయి ఉన్నట్టు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే వారిని చంపినట్టు తెలిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్…
Acid Attack: మరికొన్ని రోజుల్లో యువతి పెళ్లి, ఇంతలోనే ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ చెందిన 25 ఏళ్ల యువతిపై ఒక యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికి వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆపి ‘‘నువ్వు నాకు దక్కకుంటే, మరెవరికి దక్కకూడదు’’ అంటూ ఆమెపై యాసిడ్ పోశారు. ఉత్తర్ ప్రదేశ్ మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
Triple Talaq: వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనువు చాలించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధించడంతో పాటు భర్త ఇటీవల ఫోన్లో ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పడంతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ ఇవ్వడంతో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.