కృష్ణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జి.కొండూరు మండలం వెలగలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణ వాచ్మెన్ సాంబయ్యను గుర్తు తెలియని దుండగలు గత రాత్రి హత్య చేశారు. అంతేకాకుండా హత్య అనంతరం మద్యం బాటిళ్లతో పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మద్యానికి బానిసైన వారే ఈ హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు…
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమీన్పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్రెడ్డి(35) చందనగర్లోని ఓ ఆస్పత్రిలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు…
రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవపడిన భార్య క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న పార్వతి(35), సాయి కుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రేయ, తన్వికి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలహాలు లేని వీరి కాపురంలో గతకొద్దిరోజుల నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. శుక్రవారం పెళ్లికి వెళ్లివచ్చిన…
ఇంటికొచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తాను అంది.. సరేనని ఆ మహిళ ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ఆహ్వానించింది.. వ్యాక్సిన్ కన్నా ముందు కళ్లలో చుక్కలు వేయాలని.. ఒక మందు సీసాతో నిలబడింది. వ్యాక్సిన్ ఎలా వేస్తారో తెలియని ఆమె సరే అంది. అంతే ఇదే అదును అనుకోని కంట్లో చుక్కలు వేసి ఆమె మేడలో ఉన్న బంగారు గొలుసును తెప్పుకుబోయింది కిలాడీ లేడి.. ఈ ఘటన కర్నూల్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్టాంటన్పురంలో…
నేటి సమాజంలో మోసాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తులను వాట్సాప్ డీపీగా పెట్టుకొని.. వారికి సంబంధించిన వారికి మెడికల్ ఎమర్జేన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్లు పెట్టేది. అయితే తెలిసిన వ్యక్తి ఆపదలో డబ్బు సహాయం అడుగుతున్నారని వారు కూడా డబ్బులు పంపేవారు.…
ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన…
నేటి సమాజంలో ప్రాణానికి విలువలేకుండా పోయింది. అర్థంపర్థం లేని అనుమానాలతో మస్తిష్కంలో మంటలు పుట్టించుకోని.. వారి ఆలోచనలతో ఆ మంటలకు ఆజ్యం పోసుకుంటూ నమ్మివచ్చిన వారినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్లోని కూకల్పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో పుణ్యవతి, సంతోష్ అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగిననాటి నుంచి భార్య పుణ్యవతిపై భర్త సంతోష్ అనుమానం…
విజయవాడ పోలీసులకు కొన్నిరోజులుగా చెడ్డీ గ్యాంగ్ చెమటలు పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ వివరాలను విజయవాడ పోలీసులు కనిపెట్టారు. ఈ మేరకు చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విజయవాడ సీపీ విడుదల చేశారు. గుజరాత్లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జాయింట్గా గుజరాత్లోని దాహోద్ పోలీసులను సంప్రదించి పలు కీలక వివరాలను రాబట్టారు. ఈ విచారణలో చడ్డీ గ్యాంగ్లో కొంతమంది ఏపీకి వచ్చారని గుజరాత్ పోలీసులు…
దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి…
తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల…