జనగామ జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా గురుద్వార్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అంబేద్కర్ నగర్కు చెందిన పగడాల సందీప్ అనే వ్యక్తి ఫకీర్ సురేష్ను కత్తితో మెడ కోసి హత్య చేశాడు.
Firing on Telangana Police in Bihar: బీహార్ లో తెలంగాన పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు ఘటన కలకలం రేపింది. బీహార్, కోల్కత్తాలో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు బీహార్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు. భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు, నిందితుల…
తమిళనాడులోని చెన్నెలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. చెన్నై నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్గోల్డ్ బ్యాంకులో చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారంతో పాటు నగదును దోచుకెళ్లారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ భర్త విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పంటపొలాల్లో విజయ్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధానిలో ఘోరం జరిగింది. గోడ మీద ఓ యువకుడు మూత్ర విసర్జన చేశాడని ఓ బృందం అతడిని పొడిచి చంపేసింది. రద్దీగా ఉన్న మార్కెట్లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఆ వ్యక్తి హత్యకు దారి తీసింది.
Annamayya District: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో ఓ అత్త అతి క్రూరంగా ప్రవర్తించింది. కోడలి తల నరికి.. ఆ తలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులకు లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. కె.రామాపురంలో అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధరకు కొంతకాలంగా పడటం లేదు. తరచూ కుటుంబంలో ఇద్దరికీ విభేదాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు మరోసారి అత్తాకోడళ్ల మధ్య వార్ చోటు చేసుకుంది. దీంతో…
Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్లైన్లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్బుక్ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ…
తమిళనాడులోని చెన్నైలో గల పోరూర్ ప్రాంతానికి సమీపంలో కారులో వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి నగలను కూడా నిందితులు ఎత్తుకెళ్లారని వెల్లడించారు.