Jharkhand: శ్రద్ధా వాకర్ తరహాలో భార్య హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man hacks wife to death in Jharkhand, chops her body into 12 pieces: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యను ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా హత్యచేసి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. అయితే తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి తరహా హత్య జరిగింది. సాహెబ్ గంజ్ లో తన భార్యను నరికి, మృతదేహాన్ని 12 ముక్కలుగా చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోరియో పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలో పాత ఇంటిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రుబికా, దిల్దార్ కు రెండో భార్య. గత రెండేళ్లుగా వీరిద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు రుబికా మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో రుబికా చిధ్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్
పహాడీ తెగకు చెందిన రుబికా పహాడిన్ గా బాధితురాలిని గుర్తించినట్లు సాహెబ్ గంజ్ ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును వాడి మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రవిమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయిని ఆరోపించింది. హేమంత్ సర్కార్ హయాంలో గిరిజనులు, హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించింది. మైనారిటీ వర్గానికి చెందిన కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ అన్నారు.
తాజావార్తలు
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!