Jharkhand: శ్రద్ధా వాకర్ తరహాలో భార్య హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికిన భర్త
Man hacks wife to death in Jharkhand, chops her body into 12 pieces: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యను ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా హత్యచేసి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. అయితే తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి తరహా హత్య జరిగింది. సాహెబ్ గంజ్ లో తన భార్యను నరికి, మృతదేహాన్ని 12 ముక్కలుగా చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోరియో పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలో పాత ఇంటిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రుబికా, దిల్దార్ కు రెండో భార్య. గత రెండేళ్లుగా వీరిద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు రుబికా మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో రుబికా చిధ్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్
పహాడీ తెగకు చెందిన రుబికా పహాడిన్ గా బాధితురాలిని గుర్తించినట్లు సాహెబ్ గంజ్ ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును వాడి మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రవిమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయిని ఆరోపించింది. హేమంత్ సర్కార్ హయాంలో గిరిజనులు, హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించింది. మైనారిటీ వర్గానికి చెందిన కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ అన్నారు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!