Jharkhand: శ్రద్ధా వాకర్ తరహాలో భార్య హత్య.. శరీరాన్ని 12 ముక్కలుగా నరికిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man hacks wife to death in Jharkhand, chops her body into 12 pieces: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యను ఇంకా దేశం మరిచిపోలేదు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా హత్యచేసి శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. అయితే తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి తరహా హత్య జరిగింది. సాహెబ్ గంజ్ లో తన భార్యను నరికి, మృతదేహాన్ని 12 ముక్కలుగా చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోరియో పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలో పాత ఇంటిలో మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రబికా పహాడిన్ అనే బాధితురాలిని ఆమె భర్త దిల్దార్ అన్సారీ హత్య చేసినట్లు విచారణలో తేలింది. రుబికా, దిల్దార్ కు రెండో భార్య. గత రెండేళ్లుగా వీరిద్దరు ఒకరికొకరు తెలుసని పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు రుబికా మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో రుబికా చిధ్రమైన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
Read Also: Fraud Lady Arrest: సోషల్ మీడియాలో యువకులే టార్గెట్.. కిలాడీ లేడీ అరెస్ట్
పహాడీ తెగకు చెందిన రుబికా పహాడిన్ గా బాధితురాలిని గుర్తించినట్లు సాహెబ్ గంజ్ ఎస్పీ వెల్లడించారు. నిందితుడు ఎలక్ట్రిక్ కట్టర్ వంటి పదునైన వస్తువును వాడి మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జార్ఖండ్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రవిమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయిని ఆరోపించింది. హేమంత్ సర్కార్ హయాంలో గిరిజనులు, హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించింది. మైనారిటీ వర్గానికి చెందిన కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!