Illicit Relationship: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. దౌలత్పురాలో ఆటో గడుపుతూ జీవనం కొనసాగిస్తున్న భర్త మనోజ్.. భార్య రాధ మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా.. అదే ప్రాంతంలో నివాసముంటున్న లారీ డ్రైవర్ రాజేష్ అనే వ్యక్తి వీరి మధ్య గొడవలను ఆపేసేవాడు. దీంతో.. రాధ, రాజేష్ మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. అయితే.. ఈ విషయం భర్త మనోజ్ తెలుసుకున్నాడు. వారి మధ్య బంధాన్ని మనోజ్ వ్యతిరేకిస్తూ.. గొడవలు పెట్టేవాడు. ఈ క్రమంలో.. తమ ప్రేమకు మనోజ్ అడ్డుగా వస్తున్నాడని, రాధ తన ప్రేమికుడు రాజేష్తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. కుట్రలో భాగంగా ఏప్రిల్ 7న మనోజ్ని లాల్కువాన్లోని రాజేష్ వద్దకు పంపించి డబ్బులు తీసుకురావాలని కోరింది.
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
GT vs RR: గుజరాత్ టార్గెట్ 197.. రాణించిన పరాగ్, శాంసన్
ఈ క్రమంలో.. రాజేష్ మనోజ్ని తన లారీలో కూర్చోబెట్టి దాద్రి వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో అతనికి మద్యం ఇచ్చాడు.. ఆ తర్వాత మద్యం మత్తులోకి చేరుకోగానే బట్టలు విప్పి, ఆపై తాడుతో గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ట్రక్కు క్యాబిన్లోనే దాచాడు. మరుసటి రోజు తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేపై జహాన్ దాస్నా వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.
హత్య జరిగిన విషయాన్ని రాధకు తెలియజేసిన ప్రియుడు.. తన భర్త తప్పిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. దీంతో.. ఏప్రిల్ 9న రాధ సిహాని గేట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. కాగా.. పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఏప్రిల్ 8న దాద్రీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిసి.. ఆ మృతదేహం ఫొటోను అలీఘర్లోని అత్రౌలీలో నివసిస్తున్న మనోజ్ తండ్రి రాంఖిలాడికి చూపించారు. అతను తన కొడుకుగా గుర్తించాడు.
Yarlagadda Venkata Rao: టీడీపీలోకి చేరిన 35 ఎస్సీ కుటుంబాలు, 5 ముస్లిం కుటుంబాలు..!
కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రధారి తన భార్య రాధే అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు బుధవారం రాధతో పాటు ప్రియుడు రాజేష్ ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు రాజేష్ నుంచి లారీ క్యాబిన్లో మనోజ్ మొబైల్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్కార్డు, హత్యకు ఉపయోగించిన తాడు, మృతదేహాన్ని దాచేందుకు ఉపయోగించిన దుప్పటి, మృతుడి చెప్పులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!