Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న మహిళ దారుణహత్య.. బిడ్డను కూడా వదల్లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న జంటల్లో ఇటీవల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తర్వాత ఇలాంటివి చాలా ఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా మహరాష్ట్ర నాగ్పూర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి హత్య చేయడంతో పాటు ఆమె బిడ్డను కూడా చంపేశాడు. చివరకు అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శనివారం నాగ్పూర్లోని ఓ హోటల్లో 30 ఏళ్ల సచిన్ వినోద్ కుమార్ రౌత్ అనే వ్యక్తి 29 ఏళ్ల నజ్నిన్, ఆమె కుమారుడు యుగ్లను చంపేశాడు. ఈ ఉదంతం తర్వాత రౌత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ సిబ్బంది ఈ హత్యల్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రౌత్ సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని కనిపించగా.. నజ్నిన్ తలకు గాయం కావడంతో రక్తపు మడుగులో కనిపించింది. ఆమెను తలపై సుత్తెతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, యుగ్ శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Read Also: Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరికి మరో బంఫర్ ఆఫర్.. ఆ సినిమాలో ఛాన్స్..
ప్రాథమిక దర్యాప్తులో రైత్ బాలుడికి విషం ఇవ్వడం లేదా గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్నారు. బాలుడిని చంపడానికి ముందే నజ్నిన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు హత్యల తర్వాత నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అయిన రౌత్కి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్కి చెందిన నజ్నిన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. రౌత్ భార్యకు విడాకులు ఇవ్వకుండా, నజ్నిన్తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో రౌత్ నజ్నిన్కి ఇటీవల కాలంలో దూరంగా ఉండటం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చివరకు వారు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఇద్దరు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకుని 500 రూపాయల స్టాంప్ పేపర్పై పరస్పర ఒప్పందంపై సంతకాలు చేశారు. పోలీసులు విచారణ సందర్భంగా ఈ పేపర్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యహ్నం రౌత్, నజ్నిన్, బాలుడు హోటల్కి వచ్చినట్లు సిబ్బంది తెలిపింది.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!