2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో కెనడాతో అమెరికా తలపడనుంది. ఈసారి ప్రపంచకప్కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. 55 పరుగులతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేశారు. భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి సెషన్లోనే ఆలౌట్ కావడం గమనార్హం. సెంచూరియన్లో లొంగిపోయిన భారత జట్టు కేప్టౌన్ టెస్టులో అద్భుతంగా పునరాగమనం చేసింది.