MS Dhoni: రూ.15 కోట్లు మోసం చేశారంటూ క్రిమినల్ కేసు పెట్టిన ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దివాకర్ 2017లో ఎంఎస్డీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే అగ్రిమెంట్లో పేర్కొన్న నిబంధనలను పాటించడంలో దివాకర్ విఫలమయ్యారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుము, షేర్ లాభాలను చెల్లించవలసి ఉంది. కానీ, మిహిర్ దివాకర్, సౌమ్య బిస్వాస్ ఆ షరతును నెరవేర్చలేకపోయారు. దాంతో ఎట్టకేలకు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
Read Also: ACB Trap: పాల బిల్లు చెల్లించేందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్..!
‘ధోనిని ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసింది’
ధోని అనేక లీగల్ నోటీసులు పంపినప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు, షరతులు విస్మరించబడ్డాయి, దీనితో ధోనీ ఆగస్టు 15, 2021న సంస్థకు ఇచ్చిన అధికార లేఖను రద్దు చేశాడు. ధోనీ అనేక సార్లు లీగల్ నోటీసులు పంపాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆర్కా స్పోర్ట్స్ మోసం చేసిందని, దీంతో రూ.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కోర్టులో ధోనీ తరపున వాదించిన దయానంద్ సింగ్ తెలిపాడు. ఆర్కా స్పోర్ట్స్పై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత మిహిర్ దివాకర్ తనను బెదిరించాడని, దుర్భాషలాడాడని ఆరోపిస్తూ ధోనీ స్నేహితుడు చిట్టుగా ప్రసిద్ధి చెందిన సిమంత్ లోహానీ కూడా ఫిర్యాదు చేశాడు.
ఎంఎస్ ధోని ఇటీవలే తన నూతన సంవత్సరాన్ని దుబాయ్లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ధోనీ తన కుటుంబం, స్నేహితులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్నట్లు కనిపించాడు. ఈ పర్యటనలో ధోనీతో పాటు భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కూడా కనిపించాడు. ధోనీ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో క్రిస్మస్ జరుపుకున్నాడు. మొదటిసారిగా డిసెంబర్ 19న యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం దుబాయ్ చేరుకున్న తర్వాత రిషబ్ పంత్ ఎంఎస్ ధోనిని కలిశాడు. డిసెంబరు 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఐపీఎల్ వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్మెంట్తో ఒప్పందం కూర్చున్నాడు.ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ ఐపీఎల్ 2024 సమయంలో పోటీలోకి దిగనున్నారు.
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!