ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై గెలిచింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీకి తొలి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో కూడా గెలువాలనే కసితో ఉంది. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని కోరుకుంటుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్పై గుజరాత్ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 163 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.
సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన హసరంగ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్…