ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాసేపట్లో మ్యా్చ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే.. పంజాబ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో సికందర్ రజాకు అవకాశం దక్కింది. గుజరాత్ జట్టు కూడా ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్…
ఐపీఎల్-2024లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు యువ పేసర్ హర్షిత్ రాణా గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు ప్రయత్నించగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో.. ఆ మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఫీల్డింగ్ రాలేదు. అంతేకాకుండా.. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో రికార్డులకు తెలుగు రాష్ట్రాలు వేదికయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు హైదరాబాద్లో ఇటీవల నమోదు కాగా.. నేడు 2వ అత్యధిక స్కోరు వైజాగ్లో నమోదైంది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో చివరలో లామ్రోర్ 13 బంతుల్లో 33 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19) పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు