ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఇక.. ముంబై కూడా వరుసగా మూడింటిలో మూడు ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్…
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. హోంగ్రౌండ్ లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బౌలింగ్లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. కాగా.. ఆరంభంలోనే ట్రెంట్ బౌల్ట్ 3 కీలక వికెట్ల తీసి శుభారంభాన్ని అందించాడు.
శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగుతోంది. అందులో భాగంగా.. బంగ్లాదేశ్ జట్టు కొంత విచిత్రంగా ప్రవరిస్తోంది. బౌండరీకి వెళ్తున్న బంతి వెనకాల ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంగ్లా ప్లేయర్లకు పిచ్చి ముదిరందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వాంఖడే వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే హోంగ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ముంబై ఉంది. మరోవైపు.. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై గెలిచింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీకి తొలి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.