టీ20 మ్యాచ్లలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాటింగ్ చేసేవాళ్లు సిక్సులు, ఫోర్ల బాదడమే పనిగా పెట్టుకోవడంతో బౌలర్లు చెత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ టీ20 2022 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా సోమర్సెట్, డెర్బీషైర్ మధ్య జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన డెర్బీషైర్ మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తన…
* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్ జగన్ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ * నేడు బర్మింగ్హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్ * నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ * హైదరాబాద్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్తో పాటు…
కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ప్రియాంక జవాల్కర్ పోస్ట్ చేసిన ఒక ఫోటోకు ‘క్యూట్’ అంటూ క్రికెటర్ వెంకటేశ్ అయ్యార్ కామెంట్ పెట్టాడు. అంతే, అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పప్పులు ఉడుకుతున్నాయనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ రూమర్స్ని వాళ్లు ఖండించకపోవడంతో.. అవి మరింత బలపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రియాంక షేర్ చేసిన ఒక ఫోటో.. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. అయితే.. ఆ ఫోటోలో ఉన్న సదరు వ్యక్తి ఫేస్ కనిపించడం లేదు. అతను అటువైపుకి…
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ గతంలో ఐపీఎల్ ద్వారా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాడే. క్రీడల మంత్రిగా పనిచేస్తున్నా ఆయన మాత్రం ఇంకా క్రికెట్ ఆడుతూ తనలో ఇంకా ఆడే సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మంత్రి పదవితో బిజీగా ఉన్నా ఇంకా క్రికెట్పై దృష్టి పెట్టడం అంటే మాములు మాటలు కాదు. ఈ సందర్భంగా అటు మంత్రి…
కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్ను సమం చేసిన టీమ్ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…
ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం…
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. మొన్న మూడో టీ20 మ్యాచ్ గెలిచిన భారత కుర్రాళ్లు… నేడు నాలుగో టీ20లోనూ దుమ్మురేపేశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్లు)…
టెస్టులు, వన్డేలతో మెల్లగా సాగుతున్న క్రికెట్ లో ఐపీఎల్ సునామీలా వచ్చింది..ఆటను బిజినెస్గా మార్చటం ఎలాగో చూపింది.. వేల కోట్ల రెవెన్యూ జెనరేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఒక్క మాటలో చెప్పాలంటే, ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్టర్. అందుకే ఇప్పుడు ఐపీఎల్ ప్రసారహక్కుల వేలం సంచలనంగా మారింది..బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు వచ్చిపడ్డాయంటే, ఐపీఎల్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ అంటే నిన్నటిదాకా పరుగుల వర్షం. సిక్సుల సునామీ.. ధనాదన్ మ్యాచ్ లు, ఉత్కంఠరేపే పోరు.…
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది…