ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే WPL 2024 గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది WPL 2024 సీజన్ను ఇండియాలోని రెండు నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యుపీఎల్ సీజన్ నిర్వహించనున్నట్లు నివేదికలు వచ్చాయి.
ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను ఈరోజు విక్రయించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ను భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్గా అభివర్ణిస్తున్నారు క్రికెట్ పండితులు. 20 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి అడుగు పెట్టి ఇప్పటికే బోలెడన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఐపీఎల్లోనూ పరుగుల వరద పారించాడు. క్రికెటర్గా చాలా పద్ధతి, క్రమశిక్షణతో కనిపించే శుభ్మన్ గిల్.. వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే కమిట్ అయిపోయాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది.
ఈ ప్రపంచకప్లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్ను గెలుచుకుంది. టోర్నమెంట్లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం.
ప్రపంచకప్లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.