ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
Celebrate "Cow Hug Day" On Valentine's Day: ప్రేమికుల రోజుకు (వాలెంటైన్స్ డే)కి మరో వారమే సమయం ఉంది. అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వినూత్న ప్రకటన చేసింది. వాలెంటైన్స్ డేను ‘‘ కౌ హగ్ డే’’గా జరుపుకోండని సూచించింది. ఆవును కౌగిలించుకోవడం ద్వారా ఫిబ్రవరి 14 రోజును జరుపుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది.