Home
Covid 19 2
Covid 19 2 News
-
మహారాష్ట్రలో డెల్టా ప్లస్…టాస్కఫోర్స్ హెచ్చరిక…
మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రజలు బయటకు వస్తున్నారు. కరోనా కారణంగా ఏప్రిల్ 5 నుంచి కఠిన నిబంధనలు అమలుచేయడం ప్రారంభించారు. కేసులు పెరిగిపోవడంతో లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి కఠినంగా అమలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పుడు మహారాష్ట్రకు మూడో వేవ్ ముప్పు భయపెడుతున్నది. కరోనా వైరస్ మ్యూటేషన్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ డెల్టా ప్లస్… -
తెలంగాణలో తగ్గిన కరోనా తీవ్రత.. 24 గంటల్లో 1006 కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1006 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 613202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1798 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,91,870 మంది డిశ్చార్జ్ అయ్యారు. read more : చిత్తూరు మేయర్ అముదపై వైసీపీ శ్రేణుల్లో చర్చ ! ఇప్పటివరకు… -
అన్లాక్లో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి…
ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని ఓపెన్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఎలాగైతే పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్లాక్ సమయంలో అనవసరంగా రోడ్లమీదకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్పించి మిగతా సమయంలో ఇంట్లో ఉండటం ఉత్తమం. ఒకవేళ రోడ్డుమీదకు వేళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని బయటకు… -
భారత్ లో 60 వేలకు దిగువగా కరోనా కేసులు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,81,965కి చేరింది. ఇందులో 2,87,66,009 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,29,243 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో… -
నేడు ఏపీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్…
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కర్ఫ్యూలో భారీగా సడలింపులు చేసింది. గతంలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా ఇప్పుడు అవి 6 వేలకు వచ్చాయి. అయితే కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు. ఇక ఈరోజు ఏపీలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.ఈ ఒక్కరోజే 8 లక్షణ వ్యాక్సిన్ లు వేసేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య,… -
ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు వ్యాక్సిన్..
బిగ్ వ్యాక్సినేషన్ డేను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.. రేపు ఒక్క రోజే ఒక్కో జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.. కనీసం 8 నుంచి 10 లక్షల డోసుల వరకు వేయగలుగుతామనే… -
వ్యాక్సినేషన్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది.. ఫస్ట్ వేవ్ కంటే.. భారీగా కేసులు, ఎక్కువ సంఖ్యలో మృతులు కలవరానికి గురిచేశాయి.. బెడ్లు, ఆక్సిజన్ దొరకక అల్లాడిపోయిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. క్రమంగా కేసులు దిగివచ్చాయి.. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. కరోనా వ్యాప్తిని… -
కరోనా వ్యాప్తి నివారణకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్..!
కరోనా వ్యాప్తి నివారణకు, చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు మండలాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ.. దీనికోసం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్యను మండలాలు, అర్బన్ ప్రాంతాల వారీగా సిద్ధం చేసింది సర్కార్.. ఏపీలోని 68 మండలాల్లో వందకుపైగా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గుర్తించారు.. అత్యధికంగా 196 మండలాల్లో 25 నుంచి 49 యాక్టీవ్ కేసులు ఉండగా.. అత్యల్పంగా 18 మండలాల్లో 0-4 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. ఇక, 41… -
ఏపీలో బిగ్ వ్యాక్సిన్ డే.. ఒకేరోజు 8 లక్షల వ్యాక్సిన్లకు ప్లాన్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. అన్ని దేశాలు క్రమంగా వ్యాక్సిన్పై దృష్టిసారిస్తున్నాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం బిగ్ వ్యాక్సిన్ డే నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.. రేపు ఏపిలో బిగ్ వ్యాక్సిన్ డే నిర్వహించనున్నారు.. ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.. దీనిలో భాగంగా జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఇప్పటి వరకు ఒక్క రోజే 6 లక్షల వ్యాక్సిన్లు… -
కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన…
తాజావార్తలు
-
AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
-
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
-
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్గా ఉండి ప్లేఆఫ్స్కు అర్హత!
-
Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్వీర్కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?
-
Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!