కరోనాతో మావోయిస్టుల మరణం బూటకం.. అది పోలీసుల సృష్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా బారినపడి కొంతమంది మావోయిస్టులు మృతిచెందినట్టు ప్రచారం జరుగూతేఉంది.. అయితే.. కరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం.. కేవలం పోలీసుల సృష్టి మాత్రమే అంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ… ఇక, కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి దేశ పాలకులే కారణం అని ఆరోపించారు ఆ పార్టీ అధికార ప్రధినిధి అభయ్.. కరోనా మహమ్మారితో మావోయిస్టుల మృతి అంటూ పోలీసులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ నిరభ్యంతరంగా, మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండిస్తుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.. ఇదంతా ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాసులే చేస్తున్నారని.. కల్పిత కథలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.. కరోనా దేశంలో విజృంభిస్తున్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో ఎనిమిది విడతల్లో ఎలక్షన్ చేయడం, అనేది దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనన్న మావోయిస్టు పార్టీ.. కరోన వ్యాక్సిన్ అమ్మకాల్లో పాలకులు కార్పొరేట్ సంస్థలకు లాభాలు పండించారని.. ఇక వ్యాక్సిన్ దౌత్యం గురించి వెలువడుతున్న కారణాలు వింటూనే ఉన్నామని మండిపడ్డారు.
మా పార్టీపై కొందరు దుష్ప్రచారం చేయడం ఈనాడు కొత్త కాదు. గతంలో మా పార్టీ రోగల పాలై.. మంచం పట్టిందని అనేక కల్పిత కథనాలు ప్రచారం చేశారు.. ఇక, మా పార్టీ నాయకత్వ లొంగుబాటుకు సిద్ధమైందంటూ సంచలనాత్మక వార్తలను విడుదల చేసారు.. ఇలాంటి అన్ని అసత్యప్రచారాలు చాలక ఇప్పుడు కరోనా సోకిందంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఫైర్ అయ్యారు అభయ్.. విప్లవ రాజకీయం నుండి హీనతికంగా దిగజారిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై మాట్లాడడానికి కనీస రాజకీయ అర్హత కూడా లేదని మరోసారి స్పష్టం చేశారు మావోయిస్టులు.. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్నచీటికి మాటికి పోలీసుల కథనాలకు వత్తాసు పలుకుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిదికదాని హెచ్చరించారు. కరోనా సాకుతో మావోయిస్టుల లొంగుబాటుకు ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ పోలీసులు.. అనారోగ్యంతో ఉన్న మా ప్రియమైన కామేడ్స్ గంగాలు, శోబ్రాయిలను ఇటీవలే అరెస్టు చేసి వారికి కరోనా పాజిటివ్ తేలిందని అబద్దాలను ప్రచారం చేసి.. వారిని నాటకీయంగా ఆస్పత్రిలో చేర్చినట్టు చూపి.. నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని మండిపడ్డారు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!