Home
Corona Effect
Corona Effect News
-
Chepa Mandu : ఈ ఏడాది కూడా చేప మందు లేనట్లే..
ప్రతీ ఏటా మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేప మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందు కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్కు తరలివస్తారు. కరోనా కారణంగా చేప మందుకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ ఏడాది కూడా చేప మందును నిలిపి వేస్తున్నట్లు బత్తిని గౌరీశంకర్ వెల్లడించారు. ఈ ఏడాది అందజేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు.ఈ చేప మందు… -
Corona Updates : దేశంలో తగ్గిన కరోనా కేసులు..
కరోనా మహమ్మారి కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు మళ్లీ పెరిగిన కరోనా కేసులు తిరిగి తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కరోనా పరీక్షలను చేయగా వారిలో 1,569 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ముందు రోజు కంటే దాదాపు 600 కేసులు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశానికి కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు ఉందని కొన్ని రోజుల క్రితం నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వారు… -
Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే
కరోనా రక్కసి ప్రజల జీవితాల్లో మిగిల్చిన బాధలు అన్నిఇన్ని కావు.. కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మరణించారు. దీంతో అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న ఇల్లు.. పెద్ద దిక్కు లేకుండా పోయింది.. ఒక్కో కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ కరోనాకు బలై.. పిల్లలు అనాథలుగా మిగిలారు. ప్రజల జీవితాల్లో ఎన్నో విషాదాలను, బాధలను మిగిల్చింది కరోనా.. అంతేకాకుండా కరోనా దెబ్బకు ఎన్నో వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వారి జీవితాలు అతలా కుతలమయ్యాయి. అయితే..… -
China Corona : ముప్పు తప్పింది.. లాక్డౌన్ ఎత్తివేత
కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో చైనాలోని అతి పెద్ద నగరమైన షాంఘై సిటీలో అధికారులు లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు కట్టడికి చైనా యంత్రాంగం కఠిన నిబంధనలతో లాక్డౌన్ను అమలు చేసింది. కరోనా సోకిన ప్రదేశాలలో ముళ్ల కంచెవేసి, ఆ ప్రాంతం నుంచి ఎవ్వరినీ బయటకు రాకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా షాంఘై సిటీలో లాక్డౌన్ నిబంధనలతో ప్రజలు చాలా ఇక్కట్లు పడ్డారు కూడా. అయితే..… -
Mothers Memory: అమ్మకు గుర్తుగా కొడుకు వినూత్న ప్రయత్నం
అమ్మ.. దేవుడు అన్నిచోట్ల వుండలేక అమ్మలో తానుంటాడంటారు. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి రుణం తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. అమ్మ గుర్తుగా కొడుకు వినూత్న ప్రయత్నం చేశాడు. అమ్మకు ఇష్టమైన మామిడి చెట్టును అంత్యక్రియలు నిర్వహించిన చోటే నాటి తన ప్రేమను చాటుకున్నాడు పుత్ర రత్నం. హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న కిరణ్ కుమార్ అమ్మకు ప్రేమతో చెట్టుని నాటాడు. గతేడాది కరోనా బారిన పడి మృతి చెందిన… -
Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర… -
Thrissur Pooram Utsavam: కనుల పండువగా త్రిసూర్ పూరం
కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ త్రిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది. ఈసారి ఉత్సవంలో లక్షలాదిమంది పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు. త్రిస్సూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఉత్సవం 36 గంటలపాటు సాగుతుంది. ప్రధాన ఉత్సవాలు… -
Chandrababu Naidu: చంద్రబాబు మే డే శుభాకాంక్షలు
కార్మికులకు, కర్షకులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారు. నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో… -
Tirumala: భక్తులతో కళకళ… శ్రీవారి హుండీ గలగల
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది… -
Cement Rates Effect: మండుతున్న సిమెంట్.. నిర్మాణరంగానికి గడ్డురోజులే
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30…
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!