Rahul Gandhi: 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు తన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే దీనికి ఆ పార్టీ నేత, ఎంపీ కే మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచే పోటీ…
నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకున్నానని ప్రకటించారు.. ఇక, యాంటీ మోడీ ఓటింగ్ ఇండియా కూటమి కి ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతున్న సమస్య పెద్ద విబేధం ఏం చూపదన్నారు.. నేనేమీ పెద్ద కష్టాలు చూస్తాను అనుకోవడం లేదని చమత్కరించారు ఉండవల్లి..
INDIA bloc: వరసగా ఇండియా కూటమిలో అసంతృప్తులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మమతా బెనర్జీ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు లేదని చెప్పారు. మరోవైపు ఆప్ కూడా పంబాబ్, ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఇక బీహార రాజకీయాలు ఇండియా కూటమి ఉంటుందా..? ఉండదా..? అనే సందేశాలను లేవనెత్తింది. సీఎం నితీష్ కుమార్ మరోసారి ఆర్జేడీకి, కాంగ్రెస్ పార్టీకలు చేయిచ్చి బీజేపీతో కలవబోతున్నారు.
రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బిహార్లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి నితీష్కుమార్ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసేందుకు నితీష్కుమార్కు సోనియాగాంధీ ఫోన్ చేశారని సమాచారం.
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి తాము ఆలోచించలేదు, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్…
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అన్నారం బ్యారేజీ వలన వరద ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామ పంట భూములను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్కు తమ బాధలు చెప్పుకుంటూ సుందరశాల గ్రామ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు. అవినీతి కేసీఆర్ను వెంటనే జైల్లో…
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పని చేసిందని తెలిపారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. కోదండరామ్ ను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలనే కోదండరాంని ఎన్నుకున్నారని తెలిపారు. కోదండరాం డైరెక్షన్ లో తాను లేనన్నారు. కోదండరాం భీష్మ పాత్ర పోషించారని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న…