Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు అయోమయం.. గందరగోళం నెలకొంది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చెబుతూనే.. ఇంకోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా 36 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్కు 17 సీట్లు ఇస్తామంటూ రాయబారాలు నడుపుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే యూపీలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఈ అంశంపై అఖిలేష్ స్పందించారు.
యూపీలో కాంగ్రెస్తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
రాహుల్తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
మొత్తం 80 లోక్సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Moradabad, UP: On asking why he was not present twice for the Bharat Jodo Nyay Yatra, Samajwadi Party Chief Akhilesh Yadav says, "All is well that ends well… Yes, there will be an alliance. There is no conflict. Everything will be out and clear soon… All is well that… pic.twitter.com/fOmkbYUm9B
— ANI (@ANI) February 21, 2024
తాజావార్తలు
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
-
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో