Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు అయోమయం.. గందరగోళం నెలకొంది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చెబుతూనే.. ఇంకోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా 36 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్కు 17 సీట్లు ఇస్తామంటూ రాయబారాలు నడుపుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే యూపీలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఈ అంశంపై అఖిలేష్ స్పందించారు.
యూపీలో కాంగ్రెస్తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
Also Read
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
రాహుల్తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
మొత్తం 80 లోక్సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Moradabad, UP: On asking why he was not present twice for the Bharat Jodo Nyay Yatra, Samajwadi Party Chief Akhilesh Yadav says, "All is well that ends well… Yes, there will be an alliance. There is no conflict. Everything will be out and clear soon… All is well that… pic.twitter.com/fOmkbYUm9B
— ANI (@ANI) February 21, 2024
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..