Himachal Pradesh : ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జరిగిన క్రాస్ ఓటింగ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో తలెత్తిన రాజకీయ తుఫాను ఇప్పట్లో ఆగి పోయే సూచనలు కనిపించడం లేదు.
Congress: ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్ని కొట్టేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు భారత కూటమికి పెద్ద దెబ్బగా రుజువు చేస్తుందా లేదా ప్రతిపక్ష శిబిరాన్ని బలోపేతం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.
Congress: అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను వరసగా ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏడు దశాబ్ధాల భారత ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల సంఖ్య తొలిసారిగా 14 నుంచి 6కి పడిపోయింది. 1951లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేయగా.. ప్రస్తుతం దేశంలో…
ఇవాళ (గురువారం) ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి హస్తం గూటికి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది.
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాసేపట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.