Kishan Reddy : చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ కి చీకటి దందాలకు అండా కావాలి, బీజేపీ ఓడి పోవాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం ఒవైసీ కి ఒంగి ఒంగి సలాం కొట్టేవారని, అసెంబ్లీ ఎన్నికలకి ముందు కెసిఆర్ ను ఒవైసీ మెచ్చుకున్నారు… ఈ దేశ్ కి నేత ను వదిలేసి ప్లేట్ ఫిరాయించాడన్నారు. తెలంగాణ లో సోనియా, ఒవైసీ కుటుంబం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. దౌర్జన్యంగా హిందువుల ఇళ్లను ఖాళీ చేయించిన చరిత్ర ఎంఐఎంది అని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే.. దేశంలో మళ్లీ కుటుంబ పాలన వస్తుందన్నారు. పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు దాటినా హామీల అమలు ఊసేలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు.
మోడీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని తెలిపారు. ఎయిర్పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి గెలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై తీరుపై విరుచుకుపడ్డారు కిషన్రెడ్డి. ఆ మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. సొంత నియోజకవర్గం సికింద్రాబాద్పై ఫోకస్ పెట్టారు కిషన్రెడ్డి. ఉదయం నుంచి రాత్రివరకూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..