Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్తో "వ్యూహాత్మక పరస్పర రక్షణ" ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు వైట్ హౌజ్లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్…
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నాయకుడు కేఎస్.అళగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.
తన రాజీనామాను ఆమోదించమని ఎమ్మెల్సీ కే.కవిత కోరారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఎమోషనల్గా రాజీనామా చేశారని, పునరాలోచన చేసుకోమని తాను కవితకు సూచించానని చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాను అని గుత్తా అన్నారు. నల్లగొండ జిల్లాలో చిట్ చాట్ సందర్భంగా కవిత రాజీనామాపై శాసన మండలి చైర్మన్ స్పందించారు. సొంత పార్టీపై విమర్శలు చేసిన కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ…
Off The Record: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అత్యంత కీలకమైన బిల్లులను ఇంకా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టడంపై కొత్త కొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. ఇప్పటికే ప్రభుత్వం చట్ట సభల్లో ఐదు బిల్లుల్ని ఆమోదించి గవర్నర్కు పంపింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధనను ఎత్తేస్తూ…. రిజర్వేషన్స్ పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా ఓకే చెప్పేసింది సభ. ఇక అల్లొపతిక్…
మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కార్తకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని విషయాలలో మనం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి చెప్పడంలో మనం విఫలం అయ్యాము.. 1940 లో మొదలు పెడితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు.. కానీ అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు.. కెసిఆర్ చెబుతుంటే పెన్ను పట్టుకొని రాసుకోండి అంటే మాకే…
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.
Off The Record: వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ రచ్చ మొదలైంది. ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి అమ్మవారి ఆలయ పాలకమండలి ఏర్పాటు మంత్రి కొండా సురేఖకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మధ్య అగ్గి రేపింది. అమ్మవారి ఆలయం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న క్రమంలో… అక్కడి కార్యకర్తలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం లైన్లోకి వచ్చారు.…
Off The Record: జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సీనియర్ నేత నవీన్ యాదవ్ పేర్లపై చర్చ జరుగుతోంది. తాజాగా… నేను సైతం అంటూ… తెర మీదికి వచ్చారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి… జూబ్లీహిల్స్ టికెట్ ఖచ్చితంగా నాకే ఇచ్చి తీరాలన్నది ఆయన డిమాండ్. ఈ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్…