Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.400 కోట్లు!
- ఈరోజు దీపావళి బోనస్ రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం
- ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ఆరంభం
- బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్కు సంహరించాలి
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.
‘తొలిసారి సైంటిఫిక్గా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించాం. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసింది. బీఆర్ఎస్ తెచ్చిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటోంది. బీజీపీ నైజాం ఏమిటో దేశ ప్రజలకు తెలిసింది. ప్రధాన మంత్రి బీసీ రిజర్వేషన్పై కలిసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదు. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశాం. రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంటే.. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల న్యాయ స్థానాల్లో నిలిచిపోతుంది’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Also Read
- Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
Also Read: Hanamkonda Crime: కూతురి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఫోన్ చేసి..!
‘రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయి. బీసీల బంద్ బీజీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్. బంద్లో అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. బిల్లు అమలు జరగకపోవడం రాష్ట్ర బీజేపీ ప్రజాల గుండెకోతగా మిగిలిపోయి ఉంది. బీజేపీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తే మేము మీ వెనుక నడుస్తాం. అడ్డగోలుగా బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది. బీసీ వర్గాలు అమాయకులు కాదు.. బీసీ రిజర్వేషన్లకు మిగిలిన వర్గాలు కుడా మద్దతు పలుకుతున్నాయి. బీజేపీ పార్టీకి వ్యతిరేకముగా బంద్ జరుగుతుంది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు అందరూ మద్దతు తెలపాలి’ అని భట్టి విక్రమార్క కోరారు.
తాజావార్తలు
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!