Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ రూ.400 కోట్లు!
- ఈరోజు దీపావళి బోనస్ రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం
- ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ఆరంభం
- బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్కు సంహరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.
‘తొలిసారి సైంటిఫిక్గా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించాం. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసింది. బీఆర్ఎస్ తెచ్చిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటోంది. బీజీపీ నైజాం ఏమిటో దేశ ప్రజలకు తెలిసింది. ప్రధాన మంత్రి బీసీ రిజర్వేషన్పై కలిసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదు. జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశాం. రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంటే.. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది. బీజేపీ వల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల న్యాయ స్థానాల్లో నిలిచిపోతుంది’ అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
Also Read
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
Also Read: Hanamkonda Crime: కూతురి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య.. పోలీసులకు ఫోన్ చేసి..!
‘రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు బంద్కి పిలుపునిచ్చాయి. బీసీల బంద్ బీజీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్. బంద్లో అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. బిల్లు అమలు జరగకపోవడం రాష్ట్ర బీజేపీ ప్రజాల గుండెకోతగా మిగిలిపోయి ఉంది. బీజేపీ బిల్లు ఆమోదం కోసం కృషి చేస్తే మేము మీ వెనుక నడుస్తాం. అడ్డగోలుగా బీజేపీ నాయకత్వం మాట్లాడుతుంది. బీసీ వర్గాలు అమాయకులు కాదు.. బీసీ రిజర్వేషన్లకు మిగిలిన వర్గాలు కుడా మద్దతు పలుకుతున్నాయి. బీజేపీ పార్టీకి వ్యతిరేకముగా బంద్ జరుగుతుంది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు అందరూ మద్దతు తెలపాలి’ అని భట్టి విక్రమార్క కోరారు.
తాజావార్తలు
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!