Rahul Gandhi: కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర చర్చ
- కూలీలు.. కార్మికుల మధ్య కూర్చుని వారితో పలు అంశాలు చర్చించిన కాంగ్రెస్ అగ్రనేత
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ
- సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాహుల్ గాంధీ కూలీలు, కార్మికుల మధ్య కూర్చున్నారు. కింగ్స్వే క్యాంపులోని లేబర్ చౌక్లో ఆయన చాలా సేపు కార్మికులతో చర్చించారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నారు. రాహుల్ గాంధీ కార్యకర్తల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడిగారు .
READ MORE: Team India-PM Modi:ప్రధాని మోడీతో ఇండియా క్రికెటర్లు స్పెషల్ మీట్.. ఫొటోలు వైరల్
Also Read
కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. “ఢిల్లీలోని జీటీబీ నగర్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను విన్నవించారు. కష్టపడి పనిచేసే ఈ కార్మికులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి జీవితాలను సులభతరం చేయడం మరియు వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడం మన బాధ్యత.” అని రాసుకొచ్చింది. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ చాలాసార్లు కూలీలు, కార్మికులు, రైతుల మధ్యకు వెళ్లారు. ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ గ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ మెకానిక్లతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వైరల్గా మారిన ఫొటోల్లో రాహుల్ గాంధీ బైక్ రిపేర్ చేస్తున్నట్టు కనిపించారు. అతని చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది. దానితో అతను స్క్రూలు బిగిస్తూ.. కనిపించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!