Rahul Gandhi: కూలీలను కలిసిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర చర్చ
- కూలీలు.. కార్మికుల మధ్య కూర్చుని వారితో పలు అంశాలు చర్చించిన కాంగ్రెస్ అగ్రనేత
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ
- సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాహుల్ గాంధీ కూలీలు, కార్మికుల మధ్య కూర్చున్నారు. కింగ్స్వే క్యాంపులోని లేబర్ చౌక్లో ఆయన చాలా సేపు కార్మికులతో చర్చించారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నారు. రాహుల్ గాంధీ కార్యకర్తల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడిగారు .
READ MORE: Team India-PM Modi:ప్రధాని మోడీతో ఇండియా క్రికెటర్లు స్పెషల్ మీట్.. ఫొటోలు వైరల్
Also Read
కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేసింది. “ఢిల్లీలోని జీటీబీ నగర్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను విన్నవించారు. కష్టపడి పనిచేసే ఈ కార్మికులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి జీవితాలను సులభతరం చేయడం మరియు వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడం మన బాధ్యత.” అని రాసుకొచ్చింది. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ చాలాసార్లు కూలీలు, కార్మికులు, రైతుల మధ్యకు వెళ్లారు. ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ గ్యారేజీకి చేరుకున్నారు. అక్కడ మెకానిక్లతో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వైరల్గా మారిన ఫొటోల్లో రాహుల్ గాంధీ బైక్ రిపేర్ చేస్తున్నట్టు కనిపించారు. అతని చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది. దానితో అతను స్క్రూలు బిగిస్తూ.. కనిపించారు.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!