MP Raghunandan Rao : కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా గౌరవం లేదని, అభయహస్తం పేరు తో మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి 2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఏమైంది ? అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఎందుకు చేయలేదు ? అని, ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడ ? వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు.. ఏమైంది ? అని ఆయన అన్నారు. రుణ మాఫీ పద్రాగస్ట్ చేస్తామని భువనగిరిలో లక్ష్మి నరసింహ స్వామీ మీద, మెదక్ లో ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని, ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు.
అంతేకాకుండా..’రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రికి సరైన గైడెన్స్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేనాటికి BRS మరో 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి. మరో 15 నెలలు BRS పార్టీ ఉంటుందా ? అనేది అనుమానం. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో బెండ కాయలు, దొండకాయలు పండించుకుంటూ ప్రశాంతంగా గడపు. 5 రోజుల్లో ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. రాజకీయాలు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించడం లేదు. బీజేపీలో గుంపు మేస్త్రీలు లేరు… చదువుకున్న మేధావులు మంత్రులుగా ఉన్నారు. ఎకరాలలో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాల్లో రైతు వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ భూములకి, వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తున్న భూములకు రాళ్ళు,రప్పలు ఉన్న భూములకు ఇవ్వొద్దు’ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!