Meenakshi Natarajan : నేషనల్ హెరాల్డ్ కేసు చార్జ్షీట్లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ…
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న నిరసనలో వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు కాంగ్రెస్ నాయకులకు గాయాలయ్యాయి.
BJP vs Congres : తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు. దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్…
Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి…
పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Congress-Mehangai Par Halla Bol rally: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరుబాటు పట్టింది. నిత్యవసరాల ధరల పెరుగుదలపై “మెహంగాయ్ పర్ హల్లా బోల్” నినాదంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ రాంలీలా మైదాన్ లో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి నాయకులు, పిసిసి మాజీ అధ్యక్షులు, ఎమ్.పిలు, పార్టీ…
రికార్డు స్థాయిలో పెరిగిన ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్భవన్ వరకు ఆందోళలనకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ప్రశ్నించింది. గతంలోనే సోనియా గాంధీకి విచారణకు హాజరుకావాలని ఆదేశించినా.. కరోనా బారిన పడిన కారణంగా ఆ సమయంలో సోనియా గాంధీ హాజరుకాలేదు. తాజాగా గురువారం రోజున ఈడీ సోనియాగాంధీని 3 గంటల పాటు ప్రశ్నించింది. విచారణ సమయంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు.