Sailajanath: సోనియాగాంధీపై ఈడీ విచారణ కుట్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలోనూ నిరసనలు పెల్లుబికాయి. ధర్నా చౌక్ నిరసన లో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ సర్కార్ తీరుని ఎండగట్టారు. బీజేపీ చేయకూడని తప్పు చేస్తుంది. సోనియాను ఈడి విచారణకు తీసుకురావడం కుట్ర చర్యే.నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసు. సీఎం జగన్ కేంద్రానికి బానిసలాగా మారకూడదన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది. బీజేపీ అకౌంట్లలో వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. సోనియా, రాహుల్ దేశ ఆస్తి. రాజ్యాంగ సంస్ధలను వాడుకొని వదిలేస్తామంటే కుదరదు. తక్షణమే సోనియాగాంధీ విచారణ ఆపాలి. ఆరెస్సెస్ దేశ ప్రజలకు సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణ, చెప్పాలి. ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని కోరుతున్నాం. ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, నెహ్రూ కుటుంబీకుల పైన వేధింపులకు దిగడం దారుణం.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
2024లో బీజేపీని కాల గర్భంలో కలిపేయడం ఖాయం. సోనియా, రాహుల్ అగ్ని పునీతులుగా బయటకొస్తారన్నారు తులసిరెడ్డి. మరోవైపు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రతీకార ప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు విపక్ష నేతలు. మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధిస్తోంది, సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక , రైతు వ్యతిరేక , రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!