Sailajanath: సోనియాగాంధీపై ఈడీ విచారణ కుట్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలోనూ నిరసనలు పెల్లుబికాయి. ధర్నా చౌక్ నిరసన లో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ సర్కార్ తీరుని ఎండగట్టారు. బీజేపీ చేయకూడని తప్పు చేస్తుంది. సోనియాను ఈడి విచారణకు తీసుకురావడం కుట్ర చర్యే.నేషనల్ హెరాల్డ్ మూసేసిన కేసు. సీఎం జగన్ కేంద్రానికి బానిసలాగా మారకూడదన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది. బీజేపీ అకౌంట్లలో వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. సోనియా, రాహుల్ దేశ ఆస్తి. రాజ్యాంగ సంస్ధలను వాడుకొని వదిలేస్తామంటే కుదరదు. తక్షణమే సోనియాగాంధీ విచారణ ఆపాలి. ఆరెస్సెస్ దేశ ప్రజలకు సోనియా, రాహుల్ గాంధీలకు క్షమాపణ, చెప్పాలి. ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని కోరుతున్నాం. ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, నెహ్రూ కుటుంబీకుల పైన వేధింపులకు దిగడం దారుణం.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
2024లో బీజేపీని కాల గర్భంలో కలిపేయడం ఖాయం. సోనియా, రాహుల్ అగ్ని పునీతులుగా బయటకొస్తారన్నారు తులసిరెడ్డి. మరోవైపు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రతీకార ప్రచారం ప్రారంభించిందని మండిపడ్డారు విపక్ష నేతలు. మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధిస్తోంది, సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక , రైతు వ్యతిరేక , రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
Son’s Revenge: తండ్రి హత్యకు తనయుడి ప్రతీకారం.. రూ.30 లక్షల సుపారీ ఇచ్చి మరీ..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!