Sadhguru: బిజినెస్మేన్ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
- బిజినెస్మేన్ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
- పార్లమెంట్ సమావేశాల తీరుపై సద్గురు ఆవేదన
- సంపద సృష్టికర్తలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. పట్టుమని ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. నిరసనల పర్వంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికా లంచాల వ్యవహారం బయటపెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రూపాల్లో పార్లమెంట్ బయట, లోపల ఆందోళనలు సాగిస్తున్నారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం సాగుతోంది.
తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో సంపద సృష్టికర్తలు, ఉద్యోగవకాశాలను కల్పించేవారికి రాజకీయాలను ఆపాదించిడం సరికాదని హితవు పలికారు. భారతీయ వ్యాపార అభివృద్ధి చెందడం ముఖ్యమని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో జరగుతున్న పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు పేర్కొన్నారు. ఏవైనా అవకతవకలు చోటుచేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు ఉండాలన్నారు. అంతేకానీ.. రాజకీయంగా ఫుట్బాల్ ఆడటం తగదని పేర్కొన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి అదానీ అంశం, సంభల్ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. అదానీ లంచం ఇచ్చినట్టు అమెరికా నమోదైన అభియోగాల వ్యవహారంపై చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు గళమెత్తుతున్నాయి. సభాకార్యక్రమాలకు విపక్షాలు అడ్డుపడడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. అలాగే రైతు పండించిన పంటల మద్దతు ధరకు చట్టబద్దత, మణిపూర్ హింస, నిరుద్యోగంపై కూడా చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి.
It is disheartening to observe disruptions in the Indian Parliament, particularly when we aspire to be a beacon of democracy for the world. The wealth creators and job providers of India should not become subject of political rhetoric.. If there are discrepancies, that can be…
— Sadhguru (@SadhguruJV) December 12, 2024
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?