Sadhguru: బిజినెస్మేన్ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
- బిజినెస్మేన్ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
- పార్లమెంట్ సమావేశాల తీరుపై సద్గురు ఆవేదన
- సంపద సృష్టికర్తలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు వారాలు గడుస్తున్నా.. పట్టుమని ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. నిరసనల పర్వంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికా లంచాల వ్యవహారం బయటపెట్టింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా రూపాల్లో పార్లమెంట్ బయట, లోపల ఆందోళనలు సాగిస్తున్నారు. దీంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం సాగుతోంది.
తాజాగా ఇదే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో సంపద సృష్టికర్తలు, ఉద్యోగవకాశాలను కల్పించేవారికి రాజకీయాలను ఆపాదించిడం సరికాదని హితవు పలికారు. భారతీయ వ్యాపార అభివృద్ధి చెందడం ముఖ్యమని చెప్పారు. దీనిపై పార్లమెంట్లో జరగుతున్న పరిణామాలతో తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు పేర్కొన్నారు. ఏవైనా అవకతవకలు చోటుచేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు ఉండాలన్నారు. అంతేకానీ.. రాజకీయంగా ఫుట్బాల్ ఆడటం తగదని పేర్కొన్నారు.
Also Read
నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి అదానీ అంశం, సంభల్ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చాయి. అదానీ లంచం ఇచ్చినట్టు అమెరికా నమోదైన అభియోగాల వ్యవహారంపై చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు గళమెత్తుతున్నాయి. సభాకార్యక్రమాలకు విపక్షాలు అడ్డుపడడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. అలాగే రైతు పండించిన పంటల మద్దతు ధరకు చట్టబద్దత, మణిపూర్ హింస, నిరుద్యోగంపై కూడా చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి.
It is disheartening to observe disruptions in the Indian Parliament, particularly when we aspire to be a beacon of democracy for the world. The wealth creators and job providers of India should not become subject of political rhetoric.. If there are discrepancies, that can be…
— Sadhguru (@SadhguruJV) December 12, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?