BJP vs Congres : గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులు అరెస్ట్
- ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశాడని బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ దాడికి నిరసనగా గాంధీభవన్ ముట్టడికి బీజేపీ యత్నం. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నం.
BJP vs Congres : తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు.
దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్ వైపుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో, బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తుండగా, పోలీసులు వారిని నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత బీజేపీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ఈ పరిస్థితులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి దురదృష్టకరమైన ఘటన. ఇది కాంగ్రెస్ పార్టీ అసహనాన్ని, బీఆర్ఎస్ తరహా విధానాలను ప్రతిబింబిస్తోంది. మేము కూడా ప్రతిగా ఇలానే ప్రవర్తిస్తే, మీ జాతీయ నాయకులు ఎక్కడికి దాక్కుంటారో?” అని ప్రశ్నించారు.
అదే సమయంలో, తెలంగాణలో అవినీతి విషయాలపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “కేటీఆర్ ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు? చంచల్గూడ జైలుకు వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ నిర్ణయించుకోవాలి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. ప్రజల డబ్బును దోచుకుని కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. బీజేపీ మాత్రం తెలంగాణలో త్వరలో అధికారంలోకి వస్తుంది,” అని ధర్మపురి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పాలనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ, బీజేపీ తన రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
Chandrababu and Pawan Kalyan Vizag Tour: రేపు మధ్యాహ్నం విశాఖకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!