BJP vs Congres : గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ శ్రేణులు అరెస్ట్
- ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశాడని బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ దాడికి నిరసనగా గాంధీభవన్ ముట్టడికి బీజేపీ యత్నం. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP vs Congres : తెలంగాణలో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నారు.
దాడి అనంతరం, బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ను ముట్టడించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ పోలీసులు అప్రమత్తమై బీజేపీ శ్రేణులను అడ్డుకోవడంతో, గాంధీభవన్ వైపుగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో, బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తుండగా, పోలీసులు వారిని నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు, ఈ ఘటన తర్వాత బీజేపీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఈ పరిస్థితులపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, “బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి దురదృష్టకరమైన ఘటన. ఇది కాంగ్రెస్ పార్టీ అసహనాన్ని, బీఆర్ఎస్ తరహా విధానాలను ప్రతిబింబిస్తోంది. మేము కూడా ప్రతిగా ఇలానే ప్రవర్తిస్తే, మీ జాతీయ నాయకులు ఎక్కడికి దాక్కుంటారో?” అని ప్రశ్నించారు.
అదే సమయంలో, తెలంగాణలో అవినీతి విషయాలపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “కేటీఆర్ ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారు? చంచల్గూడ జైలుకు వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ నిర్ణయించుకోవాలి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. ప్రజల డబ్బును దోచుకుని కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. బీజేపీ మాత్రం తెలంగాణలో త్వరలో అధికారంలోకి వస్తుంది,” అని ధర్మపురి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో పాలనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ, బీజేపీ తన రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
Chandrababu and Pawan Kalyan Vizag Tour: రేపు మధ్యాహ్నం విశాఖకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?