కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
New Liquor Brands: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసింది..?. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత..
నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు.
కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జాతీయ మహిళా కమిషన్ గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ చెప్పుకొచ్చింది.
Dharmapuri Arvind: త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి లో ఎంపీ అరవింద్ ఎన్నికల కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోవాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంటే..…
నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? హామీలు ఎగ్గొట్టిన బీజేపీ కావాలా? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
Ponnam Prabhakar: గీతన్న.. నేతన్నా.. వేరు కాదు మీకు అండగా ఉక్కు కవచంలా ఉండే బాధ్యత నాది అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Nama Nageswara Rao: వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
Nama Nageswara Rao: ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదిలితే పంటలు చేతికి అందుతాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ప్రభుత్వానికి కోరారు. రైతు ఇవాళ కన్నీరు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.