Nama Nageswara Rao: కాంగ్రెస్ పనితీరు ప్రజలకు వంద రోజుల్లోనే అర్థమైంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nama Nageswara Rao: వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం నామా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ప్రకటనలతో అధికారం చేపట్టిందన్నారు. మోసపూరిత మాటలకు రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చి అవి అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని, పార్టీ కార్యకర్తలు బాధపడవద్దన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే రోజులన్నారు.
Read also: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
Also Read
రాబోయే పార్లమెంటు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ వానిని వినిపిస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్గాలకతీతంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో జిల్లాలో సాగునీరు తాగునీరు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి సమస్యలు పట్టించుకునే నాధుడే లేడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రైతులను, పేదలను ఆదుకోవాలన్నారు. ఆర్ఎస్ పార్టీ జాతీయ నేత కేసిఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!