New Liquor Brands: కొత్త బీర్ బ్రాండ్లను తాత్కాలికంగా నిలిపి వేసిన రాష్ట్ర ప్రభుత్వం..
- ఇకనుంచి కొత్త బీర్ బ్రాండ్లు లేనట్లే
- కొత్తకొత్త మీమ్స్తో నెటిజన్ల నిరసనలు
- కొత్త కంపెనీల పై అనుమానాలు
- కొత్త బీర్ బ్రాండ్లను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపి వేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Liquor Brands: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసింది..?. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. కొత్త మీమ్స్తో తమ నిరసనను తెలిపారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త బీర్లు సరఫరా చేసేందుకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది.
Read also: Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..
Also Read
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
- Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన నేపథ్యం లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటికి ఇచ్చే అనుమతులను ప్రస్తుతానికి ప్రభుత్వం నిలిపివేసినట్లు వార్తుల వస్తున్నాయి. మరోవైపు కొత్త బ్రాండ్ బీర్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని.. పరిశీలించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్లో ఉంచిందని.. బిల్లులు పెండింగ్లో ఉండడంతో కంపెనీలు బీరు సరఫరా చేయకపోవచ్చే తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు.
Chandrababu: శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం..
తాజావార్తలు
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!