వరద, పంట నష్టంపై బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.
Chandrababu: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bengal rail accident: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw) జూన్ 17, సోమవారం పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 2.5 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. వారితోపాటు స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా…
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.