CM Chandrababu: వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
- వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- ఎన్యుమరేషన్ పై మంత్రులు.. అధికారులతో సీఎం రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని.. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని.. పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం తెలిపారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే.. 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు.
YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇళ్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు.. మొదటి ఫ్లోర్ లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయిన మొదటి అంతస్తువారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవాళ్లకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్రవాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు.
Chittoor District: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి గాయాలు
ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీటమునిగినట్లు ప్రభుత్వం అంచానా వేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తి అయ్యాయి. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి కూడా పరిహారం అందిచనున్నారు. ఎన్యుమరేషన్లో రీ వెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!