Pakistan: ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనీయులకు సాయం.. 2.58 మిలియన్ డాలర్ల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబర్ తన పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక పాకిస్థానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
దీంతో ఆ దాడిలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. చైనా కాంట్రాక్టర్కు చెందిన ఐదుగురు చైనీస్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించనుందని శుక్రవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఐదుగురు చైనీయులు, పాకిస్థానీ డ్రైవర్ మార్చి 26న ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బిషామ్ ప్రాంతంలో దాసు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టడంతో మరణించారు.
చైనా పౌరుల కుటుంబాలకు తగిన మార్గాల ద్వారా చెల్లింపుల కోసం బీజింగ్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఖాతాకు ఈ మొత్తాన్ని వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే నెల ప్రారంభంలో బీజింగ్లో పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ఈ పరిహారం ప్రకటన వెలువడింది. దాదాపు ఐదేళ్లుగా పాకిస్థాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!