Cognizant: ప్రముఖ ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికన్ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఈ ఇరు సంస్థలు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్పై కాగ్నిజెంట్ ఆరోపణలు చేసింది.
Cognizant: టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్పక్కంలోని ఈ బిల్డింగ్ ను దాదాపు 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్గా ఉపయోగిస్తుంది. ఐటీ కారిడార్లోని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 - 800 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థల అంచనా వేస్తున్నాయి.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది.
ఇవాళ ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్కు శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్తో చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ…
Cognizant: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలు టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ జాబితాలో మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. కాగ్నిజెంట్కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగం అంటే నేటి యువతకు మక్కువ ఎక్కువ.. వర్క్ టెన్షన్ సంగతి ఎలా ఉన్న.. మంచి వేతలనాలు ఉండడంతో.. క్రమంగా యూత్ అటు మొగ్గు చూపుతుంది.. అయితే, టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్వేర్ సంస్థలు వేగంగా ఆటోమేషన్కు మారుతున్నాయి.. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో.. పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత పడనుంది తన నివేదికలో పేర్కొంది బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుత…