ఏపీలో బీజేపీ-వైసీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ముస్లింలను రెచ్చగొడుతూ బీజేపీ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకి స్పీకర్ అతనిని సస్పెండ్ చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై గవర్నర్ కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాం అన్నారు. పోలవరం,ఉత్తరాంధ్ర జిలాల్లో ప్రాజెక్టులు కడుతున్నాము. బీజేపీకి మాత్రమే వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది. జెఎన్టీయుకె ఆస్థులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. శ్రీశైలంలో ఎమ్మెల్యే చక్రపాణి అనుచరుడు…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన…
ఒకప్పుడు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. కానీ ఆ తర్వాత ఆ అభిమానం చెదిరిపోయింది. వైసీపీలో చేరిన ఆ నేత కీలక పదవిని పొందారు. ఇప్పుడు చంద్రబాబుపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన చంద్రబాబుని చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మరో రెండు మూడు పర్యాయాలు జగనే ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన…
ఏపీ మాజీ మంత్రి జవహర్ రెడ్డి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జవహర్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి క్రైస్తవుడు కాదని, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ పరిపాలన కొనసాగుతుందని విమర్శించారు. ఏ మతం ధర్మం మీద కూడా జగన్ కి విశ్వాసం లేదని ఆయన అన్నారు. ముస్లింలకి షాదీ ముబారక్ లేదన్నారు. Read Also: పీఆర్సీ బ్రహ్మ పదార్థంగా…
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా…
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా…
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. బిల్లులు చెల్లించాలని పోరాడుతున్న విజయనగరం చెరకు రైతులపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ అహంకార ధోరణే. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యం, ధాన్యం బకాయిలు, పంట నష్ట పరిహారం రాకపోవడం, రైతుకి ఉపయోగం లేని ఆర్బీకే సెంటర్ల కారణంగా రైతులు అనేక సమస్యలు…
జగన్ సర్కార్ పై టీడీపీ యువ నేత నారా లోకేష్ మరోమారు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు నారా లోకేష్. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే.. సీఎం జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందంటూ చురకలు అంటించారు. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని… 12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల…
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలి. రైతులకు కల్లీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం జగన్. వ్యవసాయ అనుబంధ రంగాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలన్న ఒక సదుద్దేశం.. క్రమంగా ఆర్బీకేల ఏర్పాటుకు దారితీశాయి. వీటిని నీరుగార్చేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ…
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.…