సినిమా టిక్కెట్ల వివాదానికి సంక్రాంతి లోపు తెర పడేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా వెనక్కి వచ్చేయాలన్న ఫార్ములా అమలుచేస్తున్నారు.
సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని తెలిసేలోగానే పెట్టిన పెట్టుబడి రాబడుతున్నారు. అందులో భాగంగానే బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడమే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలపై ఆంక్షలు సినిమా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిబంధనలపేరుతో తనిఖీలు చేయిస్తోంది. లైసెన్స్ రెన్యువల్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫారమ్-బి వంటి పత్రాల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేయగా.. మరికొందరు యజమానులు తమ వల్ల కాదంటూ స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ గోల ఉండదని పలువురు మంత్రులు చెబుతున్నారు. రూల్స్ అంటే అందరికీ ఒకటేనని అంటున్నారు. తాజా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది.
కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. కమిటీ పేరుతో కాలయాపన జరిగితే పెద్ద సినిమాల విడుదలపై సందిగ్ధత ఏర్పడక మానదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్న RRR, రాధేశ్యామ్ తో పాటు ఫిబ్రవరిలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల భవిష్యత్తు ఆధారపడి వుంది. సినిమా టికెట్ల వివాదం త్వరగా సమసిపోతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!