సినిమా టిక్కెట్ల వివాదానికి సంక్రాంతి లోపు తెర పడేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా వెనక్కి వచ్చేయాలన్న ఫార్ములా అమలుచేస్తున్నారు.
సినిమా హిట్ అయిందా ఫట్ అయిందా అని తెలిసేలోగానే పెట్టిన పెట్టుబడి రాబడుతున్నారు. అందులో భాగంగానే బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేయడమే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏపీలో టికెట్ ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలపై ఆంక్షలు సినిమా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిబంధనలపేరుతో తనిఖీలు చేయిస్తోంది. లైసెన్స్ రెన్యువల్, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫారమ్-బి వంటి పత్రాల పేరుతో కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేయగా.. మరికొందరు యజమానులు తమ వల్ల కాదంటూ స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు.
Also Read
దీంతో ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం తన చర్యలను సమర్ధించుకుంటోంది. ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకుంటే ఈ గోల ఉండదని పలువురు మంత్రులు చెబుతున్నారు. రూల్స్ అంటే అందరికీ ఒకటేనని అంటున్నారు. తాజా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది.
కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. కమిటీ పేరుతో కాలయాపన జరిగితే పెద్ద సినిమాల విడుదలపై సందిగ్ధత ఏర్పడక మానదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతున్న RRR, రాధేశ్యామ్ తో పాటు ఫిబ్రవరిలో విడుదల కానున్న ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాల భవిష్యత్తు ఆధారపడి వుంది. సినిమా టికెట్ల వివాదం త్వరగా సమసిపోతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!