ఎడతెరిపి లేని వానలు, వరదలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట తదితర మండలాల్లోని పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇళ్లను వారు పరిశీలించారు. గంగపట్నం ప్రాంతంలో దెబ్బతిన్న ఆర్అండ్బి రోడ్లు, ఇసుకమేట వేసిన వరిపొలాలు, కోతకు గురైన చెరువులు, ఇందుకూరుపేటలోని ముదివర్తిపాళెంలో నీట మునిగిన రాజుకాలనీని పరిశీలించారు.
రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అన్నారు జగన్. ఈ సిటీలో రోడ్లు వున్నాయి. కరెంట్, అన్ని రకాల వసతులు వున్నాయి. సుందరీకరణపై శ్రద్ధ పెడితే విశాఖ హైదరాబాద్ తో పోటీపడుతుందన్నారు. మూడురాజధానుల విషయలో జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు. వికేంద్రీకరణ…
ఈ నెల18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల18 వ తేదితో పాటు19 తేదిలలో రెండు రోజులు సభను నిర్వహించాలని భావిస్తు న్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత 20వ తేదితోపాటు21 శని, ఆది వారాలు రావడంతో ఆయా దినాలను సెలవుగా కేటాయించ నున్నారు. ఈనెల 22వ తేదినుంచి ఐదు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తేదిలపై పూర్తి స్పష్టతను ఈ…
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా?..’ అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ఐటీని తామే ప్రవేశపెట్టమని.. సాంకేతికతకు తామే ఆద్యులమని చెప్పుకునే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నారన్న టాక్ నడుస్తోంది.. సాంకేతిక ప్రవేశపెట్టడం కాదు.. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ వారిపై…
రాజమండ్రి : వైసీపీ ఎంపీ మార్గాని భరత్… రఘురామ కృష్ణం రాజు కౌంటర్ ఇచ్చారు. రఘురామ కృష్ణం రాజు సైజ్ పెద్దగా అవటంతో.. నేను పిల్లవాడిగా కనిపిస్తున్నానని చురకలు అంటించారు. కృష్ణ జలాల సమస్య, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, రేషన్ పంపిణీకి రాష్ట్రంలో పేదరిక రేఖ 60 శాతమే అని కేంద్రం చెబుతున్న లెక్కల వల్ల అన్యాయం జరుగుతోంది…ఈ అన్ని అంశాలపై పార్లమెంట్ లో తమ గళం వినిపిస్తామన్నారు. read also : తెలంగాణ యువతకు సీఎం…
అమరావతి : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీని జగన్ సర్కార్ విడుదల చేసింది.. 2021-26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించిన ఏపీ ప్రభుత్వం… ఏపీలో రిటైల్ రంగానికి ఊతమిచ్చేలా పాలసీ రూపకల్పన చేసింది. రిటైల్ రంగంలో పెట్టుబడులు.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలసీని రూపొందించిన జగన్ సర్కార్… వచ్చే ఐదేళ్ల కాలంలో రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టే విధంగా రిటైల్ పార్క్స్ పాలసీ రూపకల్పన చేయనుంది. read also…
ఏపీ సీఎం జగన్ ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. రాత్రి 9 వరకు దుకాణాలు మూసివేయాలని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు. సడలింపుల సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు…
అమరావతి : రేపు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించనుంది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ అవార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డులు ఇవ్వనుంది. read also : ఉద్యోగాల పేరుతో మోసాలు… టిటిడి కీలక ప్రకటన విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు అందించనుంది ఏపీ సర్కార్. వైఎస్సార్ లైఫ్ టైమ్…
కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో…
కరోనా వ్యాక్సినేషన్ కొరత నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లో 25 శాతం కోటాను ప్రైవేటు హాస్పిటళ్ళకు కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదని లేఖలో వెల్లడించారు ఏపీ…