మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కరెడ్డి, ఉరుకుంద(ఈరన్న) లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగరాజు స్వామి సేవా సంఘం హాల్ నందు జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముక లాగా ఉన్నారని, బీసీల పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పెంచి, బీసీ సబ్ ప్లాన్,…
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పథకాల పేరుతో ప్రజలను దగా చేసాడని.. ఈసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఫ్యాన్కు ఉరేసుకున్నట్లేనని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటాపురం, పండ్లపురం గ్రామాల్లో పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి.. బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కరెంటు బిల్లులు మూడు రెట్లకు పైగా…
పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కామెంట్స్ పై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. తడిచిన ధాన్యం ఎక్కడ ఉందో చెబితే కొంటామని అన్నారు. వెంటనే ఆర్డీవోను పిలిచి కొనుగోలు చేయిస్తాను.. సారథి నిన్నటి వరకు మాతోనే ఉన్నాడు.. ఇప్పటికి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.
కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని మండిపడ్డారు. అవినాష్ తో కలిసి తన మీద రెండుసార్లు కామెంట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు, లోకేష్ గురించి నాని మాట్లాడితే తాను ఖండించే వాడినని తెలిపారు. తాను సమర్థుడు కాదని కేశినేని నానీ అంటున్నారు.. సమర్థుడు అంటే పార్టీలు మారడమా అని విమర్శించారు. తాను అనేక మార్లు ఎమ్మెల్యే, ఎంపీగా…
వైసీపీ నాలుగవ జాబితాపై వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాయలంతో సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ జాబితాపై ప్రధానంగా చర్చించారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీతో ఎంపీ మాట్లాడుతూ.. సీబీఎన్ పగటి కలలు కంటున్నారు.. తల కిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వరు అని ఆయన వ్యాఖ్యనించారు.