మహారాష్ట్రను కాపాడుకునేందుకు.. కాంగ్రెస్, ఎన్సీపీ సీఎంగా ప్రకటించిన ఎవరికైనా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే/యూబీటీ) మద్దతు ఇస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇవాళ రాజస్థాన్లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Assembly election results 2023: 2024 లోక్సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ నేతలు.. ఆ వేడిలో చేస్తున్న ప్రకటనలు రచ్చ రచ్చ అవుతున్నాయి. కాషాయ శిబిరంలో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగుతోంది. పాదయాత్రలో భాగంగా సభలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే మక్తల్లో సభ నిర్వహించారు. ఆ సభ.. సభలో చేసిన ప్రకటనలు ప్రస్తుతం బీజేపీలో చర్చగా మారాయి. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం…
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.…
పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇక ఆమ్ అద్మీపార్టీ మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవర్ని నియమించాలి అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని అనుకుంది. ఓ మొబైల్నెంబర్ను క్రియోట్ చేసి ఆ నెంబర్కు మిస్డ్ కాల్ లేదా మెజేస్ చేయాలని ఆప్ కోరింది. జనవరి 17 సాయంత్రం వరకు సమయం…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో చెప్పుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు, సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ ప్రజల్లో చరిష్మా ఉన్న నేత లేరనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా…
మోదీ సర్కారుకు ప్రజా వ్యతిరేకత తెలిసి వస్తోందా? అంటే అంతా అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా బీజేపీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలే ఇందుకు నిదర్శంగా కన్పిస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లోని సీఎంలను సైతం బీజేపీ హఠాత్తుగా మార్చేస్తుండటంతో ఆపార్టీకి సెగ భారీగానే తాకుతోందని అర్థమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ-షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు…