Rajasthan CM Candidate: రాజస్థాన్లో ఈ రోజే బీజేపీ సమావేశం.. సీఎం పదవిపై వీడని ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ రాజస్థాన్లో ముఖ్యమంత్రి పేరును ప్రకటించే విషయంపై బీజేపీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత రేపు జైపూర్లో శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ తదుపరి సీఎం పేరును ప్రకటించనున్నారు. ఇక, బీజేపీ హైకమాండ్ పంపిన కేంద్ర పరిశీలకుడు శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేల ప్రాధాన్యతలను అడిగి తెలుసుకుని హైకమాండ్ పంపించనున్నారు. ఆ తర్వాత సీఎం పదవికి ఏకగ్రీవంగా పేరు ప్రకటిస్తారు. కేంద్ర పరిశీలకులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను కమలం పార్టీ నియమించింది. ఇప్పుడు ఈ ముగ్గురు పరిశీలకులు రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒక పేరుపై ఏకాభిప్రాయానికి రానున్నారు.
Read Also: Costly Coffee : ఈ కాఫీకి ఫుల్ డిమాండ్ .. ధర ఎంతో తెలుసా?
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
అయితే, రాజస్థాన్ సీఎం రేసులో బాబా బాలకనాథ్, వసుంధర రాజే, జైపూర్ రాజకుటుంబ యువరాణి దియా కుమారి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్లు ఉన్నాయి. వీరిలో ఎవరికి సీఎం పదవి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, తిజారా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా బాల్కనాథ్ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇప్పటికే సమావేశమయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లతో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రాగా, కాంగ్రెస్ 69 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం ఆ పార్టీకి సవాల్గా మారింది. ఇక, సీఎం పదవి కోసం రేసులో మాజీ సీఎం వసుంధర రాజే ఇటీవల తన నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించడం ద్వారా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్లో సీఎం పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!