మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు.
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు…
చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా…
వేసవి తాపానికి.. ఎండల తీవ్రతను తట్టుకోలేక.. నదులు, కుంటలు, బావుల్లో ఈతలు కొడుతూ సేదతీరుతున్నారు.. అయితే, సమయంలో అనుకోని ప్రమాదాలతో ఈ ఏడాది ఇప్పటికే ఏపీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా, చిత్తూరు జిల్లా వీకోటలో విషాదం నెలకొంది.. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.. దీంతో, శోకసంద్రంగా మారింది మోట్లపల్లి గ్రామం..
చిత్తూరు జిల్లాలో తాజాగా, ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. అస్తికోసం కోసం కన్న తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు, కోడలు.. పుంగనూరు మండలం దిగువ చదళ్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్..
యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
దారి తప్పిన భార్యకు బుద్ధి చెప్పాడు ఓ భర్త. ప్రియుడితో ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆమె ముందే ప్రియుడిని చితకబాదాడు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, వారి నుంచి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు డీఎఫ్వో భరణి..
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..