YS Jagan: మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి.. ఇప్పటికే అనేకమంది రైతులను వైఎస్ జగన్ కలసి వారి కష్టాలు తెలుసుకున్నారు అని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
Read Also: Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా..!
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ఇక, చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారు లేరు.. తూతూ మంత్రంగా ప్రభుత్వం రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించింది.. రైతులు మామిడికాయలు రోడ్డు పక్కన పడేసే పరిస్థితి వచ్చింది.. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టమాటో రైతులు చూశారని తెలిపారు పెద్దిరెడ్డి.. నా జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్న ఆయన.. ఫ్యాక్టరీలు గత ఏడాది పల్ప్ నే ఇంకా విక్రయించని పరిస్థితి… అనేకమంది.. గతంలో కాంగ్రెస్, వైసీపీ కాంగ్రెస్ రైతులకు మద్దతు ధర దొరకనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు.. పల్ప్ సిండికేట్ నా పని అంటూ నా పై విష ప్రచారం చేస్తున్నారు.. అలాంటప్పుడు నా పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా.. నా పైన విమర్శలు చేయడం అలవాటే అంటూ దుయ్యబట్టారు పెద్దిరెడ్డి..
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
మరోవైపు, పల్ప్ ఫ్యాక్టరీలు 90 శాతం టీడీపీ వారివి ఉంటే… టీడీపీ వారు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుంది అని వెల్లడించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!