YS Jagan: మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి.. ఇప్పటికే అనేకమంది రైతులను వైఎస్ జగన్ కలసి వారి కష్టాలు తెలుసుకున్నారు అని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
Read Also: Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా..!
Also Read
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
ఇక, చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారు లేరు.. తూతూ మంత్రంగా ప్రభుత్వం రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించింది.. రైతులు మామిడికాయలు రోడ్డు పక్కన పడేసే పరిస్థితి వచ్చింది.. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టమాటో రైతులు చూశారని తెలిపారు పెద్దిరెడ్డి.. నా జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్న ఆయన.. ఫ్యాక్టరీలు గత ఏడాది పల్ప్ నే ఇంకా విక్రయించని పరిస్థితి… అనేకమంది.. గతంలో కాంగ్రెస్, వైసీపీ కాంగ్రెస్ రైతులకు మద్దతు ధర దొరకనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు.. పల్ప్ సిండికేట్ నా పని అంటూ నా పై విష ప్రచారం చేస్తున్నారు.. అలాంటప్పుడు నా పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా.. నా పైన విమర్శలు చేయడం అలవాటే అంటూ దుయ్యబట్టారు పెద్దిరెడ్డి..
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
మరోవైపు, పల్ప్ ఫ్యాక్టరీలు 90 శాతం టీడీపీ వారివి ఉంటే… టీడీపీ వారు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుంది అని వెల్లడించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!