YS Jagan: మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ సమస్యలను లేవనెత్తుతున్నారు.. ఇక, మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధం అయ్యారు వైఎస్ జగన్.. ఇక, జగన్ పర్యటన, ఏర్పాట్లపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.. ఈ నెల 9న వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను పరామర్శిస్తారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి.. ఇప్పటికే అనేకమంది రైతులను వైఎస్ జగన్ కలసి వారి కష్టాలు తెలుసుకున్నారు అని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
Read Also: Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా..!
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ఇక, చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారు లేరు.. తూతూ మంత్రంగా ప్రభుత్వం రూ.4 గిట్టుబాటు ధర ప్రకటించింది.. రైతులు మామిడికాయలు రోడ్డు పక్కన పడేసే పరిస్థితి వచ్చింది.. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి టమాటో రైతులు చూశారని తెలిపారు పెద్దిరెడ్డి.. నా జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్న ఆయన.. ఫ్యాక్టరీలు గత ఏడాది పల్ప్ నే ఇంకా విక్రయించని పరిస్థితి… అనేకమంది.. గతంలో కాంగ్రెస్, వైసీపీ కాంగ్రెస్ రైతులకు మద్దతు ధర దొరకనప్పుడు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు.. పల్ప్ సిండికేట్ నా పని అంటూ నా పై విష ప్రచారం చేస్తున్నారు.. అలాంటప్పుడు నా పై కేసు ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా.. నా పైన విమర్శలు చేయడం అలవాటే అంటూ దుయ్యబట్టారు పెద్దిరెడ్డి..
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
మరోవైపు, పల్ప్ ఫ్యాక్టరీలు 90 శాతం టీడీపీ వారివి ఉంటే… టీడీపీ వారు మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు అంటూ విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి.. కూటమి ప్రభుత్వం తమ తప్పుని సరిదిద్దుకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటన ఉంటుంది అని వెల్లడించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?