CM Chandrababu: మామిడి రైతులకు సమస్య లేకుండా కార్యాచరణ.. సీఎం ఆదేశాలు
- మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి..
- సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు..
- కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులతో భేటీ..
- మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
Read Also: Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Also Read
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
ఇక, ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని.. ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఉత్పత్తి రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోడానికి స్థలం లేదని పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల అన్ లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్ , ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు సీఎంకు తెలియచేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు.
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు.. కాటన్ బాక్సుల్లో కార్మికుల శరీర భాగాలు
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, జీఎస్టీ తగ్గింపు పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్ధులకు మూడు రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. మామిడి పంటలో ఎరువులు, పురుగుమందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేస్తోందని.. మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు , పురుగుమందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెస్టింగ్ , ట్రేసింగ్, సర్టిఫికేషన్ వచ్చిందని .. మన ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు రూ.8 ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!